జగన్కు మరో షాక్, కిరణ్ కుమార్ వెంట ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే మారుమాట్లాడకుండా కార్యక్రమాల్లో సీఎం వెంటే ఉంటూ, ఆయన వాహనంలోనే ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సీఎం ఎస్పీ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో భేటీ అయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి నానితో పాటు, జగన్ వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కూడా హాజరయ్యారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలను ఏకరువు పెట్టారు. వారి మాటలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు.












Click it and Unblock the Notifications