వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్క్రిప్ట్ ప్రభుత్వానిదే, వెయిట్ చెయ్యాలి: శంకర్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాస్త వెయిట్ చెయ్యాలని చేనేత, జౌళి శాఖమాత్యులు శంకర్ రావు ఆదివారం సూచించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవలె అమెరికాలో చికిత్స చేయించుకొని భారత్ వచ్చిందని ఆమె ఇంకా కోలుకోలేదని పూర్తిగా కోలుకునే వరకు ప్రజా ప్రతినిధులు ఆగాలని విజ్ఞప్తి చేశారు. సోనియా పూర్తిగా కోలుకోని ఈ సమయంలో రాజీనామాలపై తొందర పడవద్దని వారిని కోరారు.

అక్టోబరు నెలలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కొన్ని జిల్లాల్లో వ్యాట్ పేరిట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు, తన పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోందని ఆయన అన్నారు. గురుదక్షిణ పేరుట వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అది సరికాదన్నారు. ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని ఆయన సూచించారు. తనకు భద్రత కల్పించడంపై డిజిపికి స్ర్కిప్ట్ ఇచ్చి చదివించింది ప్రభుత్వమే అన్నారు.

English summary
Minister Shankar Rao suggested Telangana Congress leaders about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X