కెసిఆర్ నిరాహార దీక్ష గురించి తెలియదు: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీక్ష గురించి తనకు తెలియదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. తెలంగాణ సమస్య త్వరలో పరిష్కారమవుతుందన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం, కాంగ్రెసు పార్టీలు ఆలోచిస్తున్నాయన్నారు. సమస్య పరిష్కారం పట్ల అధిష్టానం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఉద్యోగులు వెంటనే తమ సమ్మెను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలున్నాయని ఇదొక్కటే మార్గం అనుకోవద్దన్నారు. సకల జనుల సమ్మెను విరమింప చేయడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదనే వాదనలో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కాగా చేతకాని ప్రజా ప్రతినిధుల వల్లే తెలంగాణ ఆలస్యమవుతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేరుగా విమర్శించారు. తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ తన ప్రయత్నం తాను చేస్తున్నారని అందులో మనమూ భాగస్వాములం కావాలన్నారు. గవర్నర్‌ను కలిసి తాను రాజీనామా ఎలా ఆమోదింపజేసుకున్నాననో తెలంగాణ మంత్రులు సైతం అదే విధంగా తమ రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందినందువల్లే సమ్మె ప్రజల చేతుల్లోకి వెళ్లిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+