Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2జి చిక్కుల్లో చిదంబరం: బయటపడిన ప్రణబ్ లేఖ

pranab mukherjee
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. దీంతో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చిక్కుల్లో పడినట్లే. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపు వ్యవహారాల్లో చిదంబరం పాత్రను తప్పు పడుతూ ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది మార్చిలో ఓ లేఖ రాశారు. ఆ లేఖ బయటకు వచ్చింది. 2జి స్పెక్ట్రమ్‌ను మొదట వచ్చిన వారికి మొదట అంటూ తక్కువ ధరకు కేటాయించడానికి బదులు వేలం వేయాలని చిదంబరం సూచించి ఉండాల్సిందని అంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ లేఖ రాసింది.

చిదంబరం 2008లో 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రక్రియలో పారదర్శకత కోసం అప్పటి టెలికం మంత్రి ఎ రాజా నిర్ణయాన్ని కాదని ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాసిన లేఖను జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యన్ స్వామి బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్రపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన ఆ లేఖను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+