తెలంగాణ సమ్మె: బొత్స, కిరణ్ మధ్య తాజా చిచ్చు

ముఖ్యమంత్రితో మాట్లాడకుండానే తొలగించిన కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. తాము తొలగించిన 1300 మంది కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు అధికారికంగా కూడా ప్రకటించారు. తెలంగాణ సమ్మె విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డితో విభేదిస్తూ బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
కాగా, ఆర్టీసి జెఎసి నేతలతో బొత్స సత్యనారాయణ చర్చలు విఫలమయ్యాయి. బస్సు భవన్కు వెళ్లి ఆయన ఆర్టీసి ఉద్యోగుల జెఎసి నాయకులతో మాట్లాడారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోని నేపథ్యంలో తాను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకోవడానికి బొత్స జెఎసి నేతలతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. అయితే, సమ్మెను విరమించేందుకు ఆర్టీసి ఉద్యోగుల జెఎసి నేతలు నిరాకరించారు. కాగా, మెడికల్, పారామెడికల్ ఉద్యోగులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. తమపై ఎస్మా ప్రయోగిస్తే అత్యవసర సేవలు కూడా మానేస్తామని వారు హెచ్చరించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications