ప్రమాణం చేస్తావా: జగన్కు సిఎం రమేష్ సవాల్

వైయస్ జగన్ తనతో పాటు సిబిఐ వద్దకు రావాలని, పోలవరం ప్రాజెక్టు టెండర్లపై విచారణ జరపాలని అడుగుతానని ఆయన చెప్పారు. వైయస్సార్ హయాంలో జరిగిన జలయజ్ఞం పనులపై విచారణ జరిపించాలని జగన్ సిబిఐని కోరాలని, అలా అడగకపోతే జలయజ్ఞంలో అవినీతి జరిగిందని అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. సిబిఐ విచారణ మందగించడానికి జగన్ ఢిల్లీలో ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో తనకు తెలుసునని, దాన్ని త్వరలోనే బయటపెడతానని ఆయన అన్నారు. కేంద్రంతో జగన్ కుమ్మక్కయినా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications