మరోసారి దీక్షకు సిద్ధమైన జగన్: 1న బెజవాడలో..

రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన సోదర, సోదరీమణుల కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయాల్లో కుళ్లు, కుతంత్రం లేకుండా విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఆయన కష్టపడి రెండోసారి అధికారంలోకి తెచ్చిన ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు లేదన్నారు. కాగా ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా దీక్షలు చేపడుతున్నారు. గతంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్సు మెంట్స్ ఇవ్వాలని హైదరాబాదులో ఫీజు పోరు, న్యూఢిల్లీలో జలదీక్ష, విజయవాడలో లక్ష్యదీక్ష తదితర దీక్షలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications