తెలంగాణ తాజా ప్రతిపాదన అంగీకారయోగ్యమేనా?

అనంతపురం, కర్నూలు జిల్లాలతో కొత్త రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్, అసదుద్దీన్ కూడా సుముఖంగానే ఉన్నారు. రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ భిన్నస్వరం వినిపిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు చిత్తూరు, కడప జిల్లాలున్నాయి. రెండు జిల్లాలు తెలంగాణలోకి వస్తే, మరో రెండు జిల్లాలు ఆంధ్రలోకి వెళ్తాయి. దీనికి రాయలసీమ ప్రాంత నాయకులు ఇష్టపడకపోవచ్చు. అయితే, కృష్ణా నదీజలాలపై రాయలసీమ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగులు జలాల వాడకం పేరుతో నికరజలాలను వాడుకోవడానికి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఆ జలాలను ఖాయం చేసుకోవడానికి మాత్రమే వారు ఎక్కువగా ప్రయత్నించవచ్చు.
అయితే, కాంగ్రెసు అధిష్టానం రాయబారిగా మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ తన వద్దకు తెలంగాణ కోసం ప్రతిపాదనలను తెచ్చారని కెసిఆర్ చెబుతున్న మాటలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్ ప్రకటనను అసదుద్దీన్ ఖండించారు. తాను తెలంగాణపై గానీ హైదరాబాదుపై గానీ కెసిఆర్తో మాట్లాడలేదని, కేవలం సచార్ కమిటీ నివేదికపైనే మాట్లాడానని ఆయన అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి తెలంగాణ ఏర్పడుతుందని చెబుతూ కెసిఆర్ నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కెసిఆర్ అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు, తెరాసకు మధ్య జరిగిన ఒప్పందమేమిటో కెసిఆర్ బయటపెట్టాలని తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.
కాంగ్రెసు నాయకులు కూడా కెసిఆర్ మాటలను ఖండిస్తున్నారు. ఇంకా చర్చలు జరుగుతున్న క్రమంలో అటువంటి ప్రతిపాదన ఎలా పెడుతామని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక సమర్పించాల్సి ఉంది. కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికి వరకు ఏ విధమైన నిర్ణయానికి రాలేదని, అందువల్ల కెసిఆర్ ముందు ప్రతిపాదనలు పెట్టే ప్రసక్తే ఉండదని అంటున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications