చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోర్టుకెక్కిన వీరప్పన్ కూతురు ప్రేమ పెళ్లి ఉదంతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappan
చెన్నై: అడవిదొంగ వీరప్పన్ మరణించి ఏడేళ్లవుతోంది. తిరిగి ఇప్పుడు అతని పేరు వార్తల్లోకి వచ్చింది. అది అతని కూతురు ప్రేమ పెళ్లి వ్యవహారం వల్ల జరిగింది. 21 ఏళ్ల వీరప్పన్ కూతురు విద్యారాణి ఓ క్రైస్తవ యువకుడిని పెళ్లాడింది. ఆ వ్యవహారం కోర్టుకెక్కడమే కాకుండా మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. విద్యారాణిని పోలీసులు మంగళవారం కోర్టుకు తీసుకుని వచ్చారు. తమ ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ విద్యారాణి తల్లి ముత్తులక్ష్మి ఆమెను అక్రమంగా నిర్బంధించినట్లు మారియో దీపక్ ఆరోపించాడు.

విద్యారాణి, తాను రెండేళ్ల పాటు ప్రేమించుకుని 2011 మార్చి 30వ తేదీన పెళ్లి చేసుకున్నామని, తమ పెళ్లిని 2011 ఏప్రిల్ 26వ తేదీన కోడంబాకం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకున్నామని దీపక్ చెప్పాడు. పెళ్లి తర్వాత తాము చెన్నైలో సంతోషంగా జీవిస్తున్న సమయంలో ముత్తులక్ష్మి ఆగస్టు 25వ తేదీన విద్యారాణిని తీసుకుని వెళ్లిందని అతను చెబుతున్నాడు. సేలం జిల్లా మెట్టూరు తాలూకా మేచేరిలో వీరప్పన్ వర్ధంతి జరపాలనే నెపంతో ముత్తులక్ష్మి తన భార్య విద్యారాణిని తీసుకుని వెళ్లిందని, అప్పటి నుంతి విద్యారాణి ఆచూకీ తెలియడం లేదని అతను ఆరోపిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. విద్యారాణి ఆచూకీ తెలుసుకుని తమ ముందు హాజరు పరచాలని డివిజన్ బెంచ్ పోలీసులను ఆదేశించింది.

మంగళవారం విద్యారాణిని పోలీసులు కోర్టుకు తీసుకుని వచ్చినప్పటికీ న్యాయమూర్తులు ముందు హాజర పరచలేకపోయారు. వారు వచ్చేటప్పటికీ సమయం మించిపోవడంతో అలా జరిగింది. బుధవారం లాంఛనంగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెడతారు.

English summary
Veerappan's death, his 21-year-old daughter Vidya Rani's love marriage with a Christian youth has brought her back under judicial attention and intense media glare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X