మగతనం ఉంటే నిరూపించుకో: జగన్కు బొత్స సవాల్

అనంత ఫ్యాక్షనిజంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరి గురివింద గింజలా ఉందని విమర్శించారు. కాంగ్రెసులో ఎప్పుడూ ఫ్యాక్షనిజం సంస్కృతి లేదన్నారు. చంద్రబాబు కాంగ్రెసును విమర్శించాలనే ధోరణితో అవాస్తవాలను ఉద్రేకంగా, అసభ్య పదజాలంతో చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు హయాంలోనే హత్యా రాజకీయాలు జరిగాయన్నారు. అలాంటి బాబు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సమస్య జఠిలమవుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే ఆస్కారమే లేదన్నారు.
అందరినీ ఏకత్రాటి పైకి తీసుకు రావడమే తన పర్యటన ముఖ్యోద్దేశ్యమన్నారు. హిందూపురం నుండి అనంతపురం వరకు జరిపిన తన పర్యటనలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చెప్పానన్నారు. ఈ పర్యటనలో ప్రజలు, రైతుల సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా రైతులకు చేయూతనిస్తోందన్నారు. పార్టీలో మనలో మనకు ఎన్ని విభేదాలు ఉన్నా ఇతర పార్టీలు మనపై విమర్శలు చేసినప్పుడు మాత్రం ఏకమయ్యే సంస్కృతి కాంగ్రెసులో మాత్రమే ఉందన్నారు. ఒక కుటుంబంలో విభేదాలు సహజమేనన్నారు. అనంతలోని వెనుకబాటుతనాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి ఇక్కడి నుండి పలు పథకాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి అవకాశాన్ని జిల్లాకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఐడు జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. జిల్లా అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వ పని తీరుపై ప్రజలే న్యాయ నిర్ణేతలన్నారు.












Click it and Unblock the Notifications