సిఎంకు ఢిల్లీకి పిలుపు, తెలంగాణపై కోర్ కమిటీ భేటీ

కాగా, నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఆజాద్ నుంచి పిలుపు వచ్చింది. ప్రణబ్ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ ఆయన అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మినీ కోర్ కమిటీ ముందు హాజరవుతారని అంటున్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అభిప్రాయం వెల్లడించడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ప్రతినిధిగా గతంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా కోర్ కమిటీ సమావేశానికి ముందు మినీ కోర్ కమిటీ సమావేశం ముందు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తమ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications