వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న తెలంగాణ ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణపై తమ పార్టీ అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకోవడానికి పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ నివాసంలో వారు సమావేశమయ్యారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి వారు స్పీకర్ మీరా కుమార్ అపాయింట్‌మెంటు కోరాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో వారు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు.

తెలంగాణకు అనుకూలంగా సోమవారం సాయంత్రం పార్టీ అధిష్టానం నుంచి ఓ ప్రకటన వెలువడుతుందని భావించిన తరుణంలో అది వెనకపడిపోయిన భావన కలుగుతోంది. ఈ స్థితిలో అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచాలని, అందులో భాగంగా తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి సిద్ధపడాలని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలు స్పీకర్ వద్ద ఇంకా పెండింగులో ఉన్నాయి. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లోగా వాటిపై నిర్ణయం తీసుకుంటానని అప్పట్లో స్పీకర్ చెప్పారు. కానీ వాటిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు.

English summary
Congress Telangana MPs decided to put pressure on party high command on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X