వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న తెలంగాణ ఎంపీలు
తెలంగాణకు అనుకూలంగా సోమవారం సాయంత్రం పార్టీ అధిష్టానం నుంచి ఓ ప్రకటన వెలువడుతుందని భావించిన తరుణంలో అది వెనకపడిపోయిన భావన కలుగుతోంది. ఈ స్థితిలో అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచాలని, అందులో భాగంగా తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి సిద్ధపడాలని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలు స్పీకర్ వద్ద ఇంకా పెండింగులో ఉన్నాయి. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లోగా వాటిపై నిర్ణయం తీసుకుంటానని అప్పట్లో స్పీకర్ చెప్పారు. కానీ వాటిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు.
telangana congress high command chandrababu naidu new delhi తెలంగాణ కాంగ్రెసు హైకమాండ్ చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ
English summary
Congress Telangana MPs decided to put pressure on party high command on Telangana issue.
Story first published: Tuesday, October 11, 2011, 12:37 [IST]