హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవిలపై కేసు కొట్టేసిన హైకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మోపిదేవి వెంకట రమణలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బెంచ్ శుక్రవారం అవినీతి ఆరోపణల కేసు కొట్టి వేసింది. ఓ వ్యక్తి చేసిన ఇలాంటి అవినీతి ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటే ముందు ముందు ఇలాంటి వాటికి అస్కారం ఉంటుందని తద్వారా కోర్టు సమయం వృథా అవుతుందని కేసు కొట్టి వేసింది. కాగా చేనేత, జౌళీ శాఖమాత్యులు శంకర్ రావు సబిత, మోపిదేవిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కోర్టు విచారణ జరిపింది. శుక్రవారం కొట్టేసింది.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐ ఢీలా పడిపోలేదని శంకర్ రావు వేరుగా మాట్లాడుతూ అన్నారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా తాను స్పందిస్తానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై అవినీతి ఆరోపణలు వచ్చాయని దాని పైనా పోరాటం చేస్తానన్నారు.

English summary
High Court quashed cases against Home Minister Sabitha Indra Reddy and Mopidevi Venkataramana today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X