వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దానం నాగేందర్‌ను టార్గెట్ చేసిన మంత్రి శంకరరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్ : మంత్రి శంకరరావు తాజాగా మంత్రి దానం నాగేందర్‌ను టార్గెట్ చేశారు. సికింద్రాబాదులోని అడ్డగుట్ట దాడి ఘటనలో దానం నాగేందర్‌పై కేసు నమోదు కావడం వెనక శంకరరావు పాత్ర ప్రముఖంగా ఉందని అంటున్నారు. అడ్డగుట్టలో దళితులపై దానం నాగేందర్, ఆయన అనుచరులు దళితులపై దాడి చేశారని మంత్రి ఆరోపించారు. దీనిపై తుకారాం గేట్ పోలీసు స్టేషన్‌లో దానం నాగేందర్‌పై కేసు నమోదైంది. దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ప్రచురించిన పోస్టర్లను ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులకు చూపించారు. దానం పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. దళితులపై దాడిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చెప్పినా వెనక్కి తగ్గేది లేదని ఆయన చెప్పారు. అధిష్టానం ఆశీసులున్నంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన అన్నారు. తెలంగాణపై తాను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో మాట్లాడబోతున్నట్లు ఆయన తెలిపారు.

సికింద్రాబాదు అడ్డగుట్ట ఘటనకు సంబంధించిన మంత్రి దానం నాగేందర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. శంకరరావు పట్టు మేరకే దానంపై ఆ కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ఆదివారం ఉదయ అడ్డగుట్టలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన నాగేంద్ర కాన్వాయ్‌పై కొందరు కోడిగుడ్లు విసిరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి అనుచరులు ఆందోళనకారులపై ఎదురు దాడికి దిగారు. ఈ ఘటనపై శ్రవణ్ కుమార్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తుకారాంగేట్ పోలీసు స్టేషనులో దానపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కింద కేసు నమోదైంది.

English summary
Minister P shankar Rao fresh target is another minister Danam Nagender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X