ధర్మవరం హత్య కేసులో ముగ్గురు లొంగుబాటు
ఆ హత్య కేసులో 14 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ముగ్గురు ఇదివరకే ధర్మవరం పోలీసు స్టేషనులో లొంగిపోయారు. తాజాగా, కేసులో ప్రధాన నిందితుడు సుధాకర్ రెడ్డి లొంగిపోయాడు. అతని నేర చరిత్ర చాలా పెద్దదని అంటున్నారు. ఫ్యాక్షన్ హత్యల్లో అతని పాత్ర ఉందని సమాచారం. ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత సుధాకర్ రెడ్డి తిరుపతి, తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల నుంచి అతను లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చివరకు సోమవారం డిజిపి ముందు తన ఇద్దరు అనుచరులతో పాటు లొంగిపోయాడు.
Comments
English summary
Three accused in Dharmavaram murder case surrendered before DGP Dinesh Reddy.
Story first published: Wednesday, October 19, 2011, 12:14 [IST]