కారు అపకుండా వెళ్లిన మంత్రి, పోలవరం వద్ద భద్రత

మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఉస్మానియా విశ్వవిద్యాలయ జెఏసి వస్తుందని తెలియడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీగా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. విద్యార్థులకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఇటు తెలంగాణవాదులు, అటు సీమాంధ్రవాదులు వస్తారని తెలియటంతో భారీగా పోలీసులను మోహరించారు. రోడ్డు, జలమార్గాల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications