మిస్టర్ కెసిఆర్! జాగ్రత్త: సవాల్ స్వీకరించిన టిటిడిపి

Mothkupali Narasimhulu
హైదరాబాద్: తమను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే వారిగా పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మిస్టర్ కేసిఆర్ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కెసిఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బూట్లు తుడవడానికి వెళ్లావా అని ప్రశ్నించారు. మోసానికి, దగాకు కెసిఆర్ మారుపేరన్నారు. ఆయన ఉద్యమం కుటుంబం కోసమే కానీ తెలంగాణ ప్రజల కోసం కాదన్నారు. తెలంగాణ రాకపోవడానికి అసలు కారణం కెసిఆరే అని ఆరోపించారు.

బడుగులు ఎదగడం ఆయనకు ఇష్టం లేదన్నారు. అందుకే వరంగల్‌లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కొట్టించారన్నారు. కెసిఆర్ మరో చెన్నారెడ్డి అని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం అన్న కెసిఆర్ మంత్రి పదవులు ఎందుకు తీసుకున్నారన్నారు. కెసిఆర్ వ్యక్తిగత సంపాదన కోసమే ఉద్యమం అన్నారు. కెసిఆర్ తన కుటుంబం ఆస్తులు ప్రకటించలేదన్నారు. ఓడల మంత్రిగా ఆయన ఎన్ని ఓడలు సంపాదించారో చెప్పాలన్నారు. కెసిఆర్ పోలవరం విషయంలో వాస్తవాలు దాచి మాట్లాడారన్నారు. ఆయన అవినీతి నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పోలవరం టెండర్ల వల్లే సమ్మె ఆగిపోయిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+