హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్ధన్ రెడ్డి రిమాండు రెండు వారాలు పొడిగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ రెడ్డిల సిబిఐ రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో మరో 14 రోజులు గాలి, శ్రీనివాస్ రెడ్డిలను రిమాండ్‌కు అప్పగించమని సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టును కోరిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపి మరో పద్నాలుగు రోజులు వారిని రిమాండుకు అప్పగించింది.

కాగా ఇటీవల సకల జనుల సమ్మె సమయంలోనూ ప్రత్యేక కోర్టు గాలి కేసును రెండు సార్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి గనుల కేసును సిబిఐ అధికారులు ఇటీవల వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పోర్టులో కూడా అధికారులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే.

English summary
CBI special court extended Gali Janardhan Reddy remand for two weeks today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X