ఆత్మ కాంగ్రెసులోనే: పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై శంకరరావు

P Shankar Rao
హైదరాబాద్/విశాఖపట్నం: కాంగ్రెసు పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ముగ్గురు శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నప్పటికీ వారి ఆత్మ మాత్రం కాంగ్రెసులోనే ఉంటుందని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు సోమవారం విశాఖపట్నంలో అన్నారు. తెలంగాణపై సందిగ్ధత ఎక్కువ కాలం కొనసాగదన్నారు. నవంబరు నెలలో కేంద్రం నుండి ఏదో ఒక ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు దుస్థితిలో ఉన్నారని వారిని కొంతవరకైనా ఆదుకుంటామన్నారు. ఆయన విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాదులో అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తమ మెజార్టీ నిరూపించుకుంటుందన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన మేరకు భూకేటాయింపులపై సభాసంఘాన్ని త్వరలోనే వేస్తామని ఆయన చెప్పారు. కాగా ఆనం శాసనసభ సమావేశాల నిర్వహణ, భూముల కేటాయింపుపై సభాసంఘం తదితర విషయాలపై చర్చించేందుకు అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+