వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు, ఎమ్మార్ ప్రతినిధులకు ఐటి నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పన్ను (ఐటి) నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కూడా ఐటి నోటీసు జారీ అయింది. సిబిఐ సేకరించిన ఆధారాలను కోర్టు ద్వారా తీసుకుంటే అభ్యంతరం ఏమిటో తెలియజేయాలని ఐటి శాఖ వైయస్ జగన్‌కు నోటీసు జారీ చేసింది. జగన్ ముందస్తు పన్ను చెల్లించినప్పటికీ సిబిఐ సేకరించిన ఆధారాల ఆధారంగా ఆదాయాన్ని లెక్క వేస్తామని ఐటి శాఖ అధికారులు అంటున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తుల వివరాలు తమకు ఇవ్వాలని ఇంతకు ముందు బెంగళూర్ ఐటి శాఖ సిబిఐని కోరింది. అయితే, కోర్టు ద్వారా మాత్రమే తాము ఇవ్వగలుగుతామని సిబిఐ చెప్పడంతో బెంగళూర్ ఐటి శాఖ కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ కూడా వైయస్ జగన్‌కు చెందిన ఆస్తుల వివరాలను సిబిఐ నుంచి పొందడానికి సిద్ధపడి కోర్టును ఆశ్రయించింది. జగన్‌కు నోటీసు ఇవ్వకుండా ఎలా తీసుకుంటారని కోర్టు అడగడంతో ఐటి శాఖ మంగళవారం నోటీసు జారీ చేసింది.

English summary
IT department issued notices to YS Jagan and Emaar properties reprtesentatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X