ఊసరవెల్లి ముదిరితే చంద్రబాబు: కెటిఆర్ వ్యాఖ్య

ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రులు బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రచ్చబండను బహిష్కరించకపోతే వారి నియోజకవర్గాల్లో వారి నిర్వాకాన్ని ప్రజల ముందు ఎండగడుతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకపోతే తెలంగాణ మంత్రుల ఇళ్లను దిగ్బంధం చేస్తామని ఆయన అన్నారు. దొంగల్లా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ప్రాంత మంత్రులు గబ్బిలాల్లా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులను తెరాస ప్రలోభ పెడుతుందని అంటున్న మంత్రి శ్రీధర్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications