వేదికపైకెక్కి ఎమ్మెల్యే హంగామా, సొమ్మసిల్లిన దాస్యం

కాగా కూకట్పల్లిలోని జెఎన్టియు కళాశాలలో తెలంగాణ జెఏసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా ప్రకటిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి గన్ పార్కు వద్దకు మహా ర్యాలీ నిర్వహించారు. చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు. ఎబివిపి ఆధ్వర్యంలో కూడా ప్రతిజ్ఞా దివస్ నిర్వహించారు. మరికొందరు విద్యార్థులు ఢిల్లీలో దీక్ష చేపడుతున్న కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు మద్దతుగా ఓయులో దీక్ష చేపట్టారు. కాగా పోలీసుల ర్యాలీని అడ్డుకోవడానికి భారీ స్థాయిలో పోలీసులు ఎన్సిసి గేటు వద్ద సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications