'జగన్ సంస్థల్లోకి అడ్రస్ లేని కంపెనీల పెట్టబడులు'

V Hanumantha Rao
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహాయం పొంది ఉంటారనే ఉద్దేశంతోనే సిబిఐ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను విచారణకు పిలిచి ఉంటుందని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ సంస్థల్లోకి 302 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎలా వచ్చాయని, పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎక్కడివో, ఆ కంపెనీలు ఎవరివో బయటకు రావాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. లాభాలు పొందినందుకే జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారని ఆయన అన్నారు. జగన్ సంస్థల్లో 33 కంపెనీలు పెట్టబడులు పెట్టాయని, పెట్టుబడులు పెట్టినవాళ్లు అతివాదులా.. ఐఎస్ఐ తీవ్రవాదులా బయటకు రావాలని ఆయన అన్నారు.

జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ఊరూ పేరూ లేదని, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదని ఆయన అన్నారు. చిరునామాలు లేని సంస్థలకు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయో సిబిఐ సమగ్రంగా విచారణ జరపాలని ఆయన అన్నారు. జగన్ సంస్థల్లోకి ప్రవహించిన నల్లధనం ప్రజలకు దక్కాలని ఆయన అన్నారు. దేశంలోని అక్రమాలపై సిబిఐ విచారణలు సక్రమమైన పద్ధతిలోనే సాగుతున్నాయని ఆయన అన్నారు. అక్రమ డబ్బును ప్రభుత్వానికి అప్పగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలనకు కాగ్రెసు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. దేశంలో అవినీతి నిర్మూలన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌ల వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిపై బిజెపి ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+