ఎమ్మెల్యేల జిఎస్పిసి ముట్టడి, దిగొచ్చిన కిరణ్ ప్రభుత్వం

సముద్రంలోని కార్యకలాపాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని తమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. వేటకు ఆంక్షలు విధించడంపై వారు మండిపడుతున్నారు. రిగ్ల వల్ల సముద్రంలో మత్స్యసంపద కోల్పోవాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. మూడేళ్లుగా తమకు న్యాయం చేయాలని కోరుతున్న వారు గత నలభై రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమవారం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రిగ్ల ముట్టడికి యత్నించడంతో ప్రభుత్వం దిగొచ్చింది.
కాగా అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా బైరవపాలెం సమీపంలోని సముద్రంలో ఉన్న జిఎస్పిసి రిగ్గును ముట్టడించడానికి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సుమారు 500 పడవల్లో వేలాది మత్స్యకారులు బయలుదేరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేలు రిగ్ ముట్టడించడానికి వస్తున్నారని తెలుసుకొని భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు, పోస్టుగార్డులు, ఆంధ్రా పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. సమీప ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. రిగ్ తీర ప్రాంతం నుండి 24 నాటికల్ మైళ్ల దూరంలో ఉంటుంది. ఓ సమయంలో పోలీసులతో ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. సుమారు 50 గ్రామాల్లోని మత్స్యకారులు పాల్గొన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications