వేషము మార్చెను, చంద్రబాబు రైతు పోరు బాట

స్వర్గీయ ఎన్టీ రామారావు ధోవతి, లాల్చీలతో తమకు దగ్గరివాడిగా రైతులకు కనిపించేవారు. ఎన్టీ రామారావు ప్రసంగాలు కూడా ఎక్కువగా ఆకట్టుకునేవి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అచ్చమైన పంచెకట్టుతో రైతుల మధ్యకే కాదు, అన్ని వర్గాల ప్రజల మధ్యకు వెళ్లేవారు. ఎప్పుడో గాని ఆయన సూట్ ధరించేవారు కారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులను విస్మరించినందువల్లనే తిరిగి అధికారంలోకి రాలేకపోయానని భావిస్తున్న చంద్రబాబు ఇప్పుడు తలపాగా ధరించి రైతులకు దగ్గర కావాలని చూస్తున్నారు. కిందనే కూర్చుని భోజనం చేస్తున్నారు. ఈ రకమైన చంద్రబాబునైనా రైతులు నమ్ముతారా అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేం.












Click it and Unblock the Notifications