ఎమ్మెల్యేలను వైయస్ జగన్ అవమానించారా?

YS Jaganmohan Reddy
హైదరాబాద్: తన వైపు వచ్చిన శాసనసభ్యుల పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవమానించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఉండదలుచుకున్నవారు ఉండండి, వెళ్లదలుచుకున్నవారు వెళ్లండి ఆయన తన వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులతో ఆన్నట్లు తెలుస్తోంది. దీంతో వారు తీవ్రమైన అవమానానికి గురయ్యారని అంటున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకుల సమీక్షా సమావేశంలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే దిమ్మ తిరిగిపోయిందని కూడా ఓ జాతీయ మీడియాలో వార్తాకథనం వచ్చింది.

తమ పట్ల జగన్ అనుసరిస్తున్న అవమానకరమైన పద్ధతికి చాలా మంది శాసనసభ్యులు మనసు నొచ్చుకున్నట్లు చెబుతున్నారు. దీంతోనే వారు తిరిగి తమ మాతృ సంస్థ కాంగ్రెసులోకి రావాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా, జగన్‌పై సిబిఐ దర్యాప్తుల నేపథ్యంలో తమ భవిష్యత్తుపై వారు ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలోనే జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కొంత మంది కాంగ్రెసులోకి తిరిగి వస్తారని మీడియా వార్తాకథనాలు ప్రచురించింది. తిరికి రావడానికి కొంత మంది శాసనసభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చెప్పారు.

కాగా, ఆ వార్తలను తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో ఖండింపజేసే వ్యూహాన్ని వైయస్ జగన్ ఎంచుకున్నారు. పూతలపట్టు రవి, బాబూరావు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి కొంత మంది శాసనసభ్యులు తాము జగన్‌తోనే ఉంటామని ప్రకటనలు ఇచ్చారు. మొత్తం మీద, జగన్ వైపు వెళ్లిన శాసనసభ్యులు అంత సౌకర్యంగా లేరనేది అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+