అరెస్టు భయంతో సెలవుపై వెళ్లిన ఐఎఎస్ శ్రీలక్ష్మి?

గాలి జనార్దన్ రెడ్డికి గనుల లీజులు మంజూరు చేయడంలో ఆప్పటి గనుల మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్, శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గనుల కాంట్రాక్టర్ కొండా రెడ్డి ఆ ఇద్దరు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను వారిద్దరు కోట్ల రూపాయలు లంచం అడిగారని కూడా ఆయన చెప్పారు. కొండా రెడ్డి వాంగ్మూలాన్ని సిబిఐ ఇప్పటికే రికార్డు చేసింది. ఈ స్థితిలో తన అరెస్టు తప్పదనే భయంతోనే శ్రీలక్ష్మి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications