వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం: మంత్రులపై రాజయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajaiah
వరంగల్: జిల్లా కాంగ్రెసులో విభేదాలు బయటపడ్డాయి. వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య ఆదివారం జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనను వారు అధికారిక కార్యక్రమాలకు తనను పిలవకుండా అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. పార్టీ నుండి బయటకు పంపించేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు నేతలు తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సోమవారం జరిగే తెలంగాణ కాంగ్రెసు పార్టమెంటు సభ్యుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా గత కొంతకాలంగా రాజయ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తీవ్రంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Differences took place in Warangal district Congress. MP Rajaiah unhappy with Ministers Ponnala Laxmaiah and Baswaraj Saraiah's attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X