భయమొద్దు నేనున్నా, కాంగ్రెసుకు కెసిఆర్ శాపనార్థాలు

k chandrasekhar rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై శనివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీపై తీవ్రంగా విరుచుకుపడుతూ ఆ పార్టీకి శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తాను ఉన్నానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఉద్యమాన్ని కళ్లుండి చూడలేని కబోది అని ప్రధానిపై ధ్వజమెత్తారు. ఆయనకు ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్య విలువలపైన గౌరవం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోపాన్ని కాంగ్రెసు రుచి చూస్తుందని, తెలంగాణ సమాజం కాంగ్రెసును భూస్థాపితం చేయడం ఖాయమని ఇదే నా శాపం అంటూ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలతో తానున్నానని భయపడాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రకాలుగా పోరాడి తెలంగాణ సాధించుకుందామన్నారు.

కాగా ప్రధాని ప్రకటనపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరాంలు మండిపడ్డారు. ప్రధాని ప్రకటన బాధ్యతరాహిత్యమని, అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరు వేరుగా అన్నారు. నిర్ణయం ప్రకటించాల్సిన సమయంలో కాంగ్రెసు దొంగదారులు వెతుకుతోందన్నారు. కాంగ్రెసు నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని కొత్తగా మాట్లాడిందేమీ లేదని తెలంగాణ ఇవ్వలేమని ఆయన చెప్పలేదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వలేమని మాత్రమే చెప్పారని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. పార్లమెంటులో చేసిన ప్రకటనకు కట్టుబడకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారని జెఏసి చైర్మన్ కోదండరాం అన్నారు. పూటకో మాట మారుస్తూ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+