హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై కేసుకు సిబిఐ రంగం సిద్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసు విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) సోమవారం తర్వాత కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జెడి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోని సిబిఐ బృందం కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను దర్యాఫ్తు చేస్తున్న నేపథ్యంలో బాబు ఆస్తుల విచారణ కోసం మల్టీ డిసిప్లినరీ టీం హైదరాబాద్‌కు రానుంది. ఈ బృందంలో సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడి), సెబి అధికారులు ఉంటారు.

కాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆస్తులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పీలుకు వెళ్లేందుకు బాబు సుముఖంగా లేనప్పటికీ పార్టీ ప్రతిష్ట కోసమైనా అప్పీలుకు ఒప్పుకోవాలని సీనియర్లు బాబుపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

English summary
It seems, CBI may booked case against TDP chief Nara Chandrababu Naidu after monday. Multi Disciplinary team will come to Hyderabad to enquiry Babu case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X