వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా వస్తారు: డిఎల్

DL Ravindra Reddy-Danam Nagender
కడప/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మరింత మంది శానససభ్యులు కాంగ్రెసులోకి తిరిగి వస్తారని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేస్తుందని ఆయన శనివారం కడప జిల్లాలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు వైపే ఉంటారని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. వారంతా కాంగ్రెసు టికెట్ మీదే గెలిచారని, అందువల్ల వారంత కాంగ్రెసు వైపే ఉంటారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికార కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్‌లో అన్నారు. సిబిఐ విచారణ నుంచి దృష్టి మళ్లించడానికే చంద్రబాబు అవిశ్వాస ప్రతిపాదన ప్రకటన చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. శానససభలో చంద్రబాబుకు తగిన రీతిలో సమాధానమిస్తామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తమకు తగిన సంఖ్యాబలం ఉందని ఆయన చెప్పారు.

రైతు సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని శానససభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్‌లో అన్నారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కునే సంఖ్యా బలం తమకు ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+