చంద్రబాబు, కెసిఆర్పై లక్ష్మణ్ బాపూజీ మండిపాటు

కొంతమంది నేతలు రాష్ట్ర విభజనను వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ, ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమైక్య వాదాన్ని ప్రజలు కోరుకోవడం లేదని, కేవలం పెట్టుబడిదారులు మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయంగా కలిసి ఉండాలని చెప్పేందుకే సద్భావన యాత్రను ప్రారంభించామన్నారు. చిన్న రాష్ట్రాలు కోరుకుంటున్న ఆయా ప్రాంతాల ఉద్యమకారులంతా కలిసి రావాలని కోరారు. ఎన్డీఏ హయాంలో తెలంగాణ రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఢిల్లీలో ఈనెల 24న సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications