తెలంగాణపై బొత్స సత్తిబాబు ఎలా సర్ది చెబుతారు?

botsa sathyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ త్వరలో తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్నారు. పిసిసి చీఫ్ అయ్యాక ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు. అప్పుడే ఆయనకు తెలంగాణ సెగ తగిలింది. దానికి ఆయన కాంగ్రెసు పార్టీ తెలంగాణ సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, త్వరలో పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారు. ఆయనను తెలంగాణ అంశంపై ఎప్పుడు అడిగినా ఆదే మాట పల్లె వేసేవారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తాము ఇప్పట్లో తెలంగాణ తేల్చలేమని ప్రకటించారు. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో బొత్స పర్యటిస్తే ఏం చెప్పి సర్ది చెబుతారనే ప్రశ్న తలెత్తుతోంది.

సీమాంధ్ర ప్రాంతంలోని నేతలలో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ప్రముఖ నేత బొత్స. వ్యక్తిగతంగా ఆయనకు తెలంగాణపై ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టాక అధిష్టానం మాటే ఆయన మాట కావాలి. పార్టీ నుండి తెలంగాణపై ఎలాంటి ప్రకటన రాలేదు. పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఎస్సార్సీ పై గానీ, ప్రత్యేక సమైక్య రాష్ట్రం పై గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మన్మోహన్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ ఆయన ప్రధాని. అయితే ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని పార్టీని వేరుగా చూడలేరు.

ఇప్పటి వరకు బొత్స సీమాంధ్ర ప్రాంతంలో విస్తృత పర్యటనలు జరిపారు. త్వరలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరపనున్నారు. ప్రజలు ఆయనని తెలంగాణపై నిలదీసే అవకాశాలున్నాయి. ప్రధాని ప్రభుత్వ నేత అయినప్పటికీ ఆయన కాంగ్రెసు పార్టీ వ్యక్తి కాబట్టి పార్టీ నుండి ప్రకటన రాలేదని బొత్స చెప్పినా ప్రజలు నమ్మె పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు త్వరలో తెలంగాణ తేలుతుందని ప్రజలకు చెప్పిన బొత్స తన తెలంగాణ పర్యటనలో ఈసారి ప్రజలకు ఏం చెబుతారో?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+