నైతికత అంటే ప్రభుత్వాలు పదిరోజుల్లో పడిపోయేవి: జెసి

మంత్రులు తప్పు చేస్తే శిక్షించడం సబబే అన్నారు. నాపై కేసు వేసినా స్వాగతిస్తానని చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యపై తెలుగుదేశం పార్టీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై బురద జల్లడం సరికాదన్నారు. జనార్ధన్ రెడ్డి హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నది రోశయ్య కాదని అలాంటప్పుడు అప్పుడు జరిగిన దానికి ఆయన ఎలా బాధ్యులవుతారన్నారు. ఇన్నాళ్లూ మంత్రులపై మాట్లాడకుండా ఉన్న టిడిపి నేతలు ఇప్పుడు కోర్టుకెళ్లడం కక్ష సాధింపేనన్నారు.












Click it and Unblock the Notifications