ఎడ్ల బండిపై జగన్ సవారీ, ఓదార్పు యాత్రలో చిత్రం

అంతకు ముందు తన ఓదార్పు యాత్రలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పత్రి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆయన అన్నారు. పత్తి పంట దిగుబడి 15 క్వింటాళ్ల వరకు ఉండేదని, ఇప్పుడు విద్యుత్ లేకపోవడం వల్ల నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 6 వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 600 రూపాయలతో సరిపెడుతోందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో గ్రామీణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, అయినా పట్టించుకునే వారే లేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications