జగన్‌కు సన్నిహిత ఎమ్మెల్యే ద్వారంపూడి హ్యాండ్!

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎమ్మెల్యే దూరం కానున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయమై జగన్ తీరు నచ్చకే ఆయన తిరిగి కాంగ్రెసు గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసుకు గూటికి తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్ ద్వారంపూడితో నేరుగా మంతనాలు జరిపారు.

కాగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేల్లో ఒకరు. 2009 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ద్వారంపూడి టిక్కెట్ పొందగలిగారు. అప్పుడు ఈయనకు జగన్ చొరవతోనే టిక్కెట్ దక్కినట్లుగా తెలుస్తోంది. జగన్ చొరవతో టిక్కెట్ దక్కించుకొన్న ద్వారంపూడి తిరిగి కాంగ్రెసు గూటికి చేరే అంశం చర్చనీయాంశమయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+