వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సిఎం గాలం

తాజాగా, జగన్ వర్గం శానససభ్యులు బాలరాజు, గొర్ల బాబూరావు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. ఇదే సమయంలో తెలంగాణ తీర్మానాన్ని ముందుకు తెచ్చి అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేందుకు సహకరించాలని వారు తెరాస నాయకులను కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాల నిరూపణకు సిద్ధపడుతున్నాయి. తిరుగుబాటు శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారిలకు కూడా తెలుగుదేశం విప్ జారీ చేసింది. వారు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందేనని టిడిపి విప్ దూళిపాళ్ల నరేంద్ర చౌదరి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేసింది.
కాగా, వైయస్ జగన్ గుంటూరు నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సాధ్యమైనంత ఎక్కువ మంది తన నుంచి జారిపోకుండా చూసునే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా తన శాసనసభ్యులతో ఓటు వేయించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు సిద్ధపడ్డాయి. సిపిఐ సభ్యులు నలుగురు ఉండగా, సిపిఎంకు ఒక్క సభ్యుడు ఉన్నాడు.












Click it and Unblock the Notifications