వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంకర్రావుకు చేదుఅనుభవం, మావంటి పులులతో రాష్ట్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

shankar rao
న్యూఢిల్లీ: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావుకు శుక్రవారం న్యూఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం కోసం జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న నళిని వద్దకు శంకర్ రావు వెళ్లారు. అయితే తెలంగాణవాదులు అతనిని ఆమె వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని వారు శంకర్ రావును డిమాండ్ చేశారు. అనంతరం శంకర్ రావు మాట్లాడుతూ పిల్లలు పోరాడితే తెలంగాణ రాదని మాలాంటి పులులు పోరాడితేనే తెలంగాణ వస్తుందన్నారు.

కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ పోలీసు అధికారిణి నళిని జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తాము కొత్తగా ఏమీ అడగటం లేదని అరవయ్యేళ్ల క్రితం ఉన్న తెలంగాణనే అడుగుతున్నామని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలన్నారు. నళిని దీక్షకు, బిజెపి, ఉస్మానియా ఐక్య వేదిక విద్యార్థులు మద్దతు పలికారు.

English summary
Minister Shankar Rao faced bitter experiences in New Delhi from Telanganites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X