హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుదీర్ఘ చంద్ర గ్రహణం: శ్రీవారు సహా దేవుళ్లకు విశ్రాంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lunar Eclipse
హైదరాబాద్: శనివారం సాయంత్రం సుదీర్ఘమైన చంద్రగ్రహణం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని దేవుళ్లకు విశ్రాంతి లభిస్తోంది. రాష్ట్రంలోని ఆలయాలను శనివారం ఉదయం నుంచే మూసేశారు. రేపటికి అన్ని దేవాలయాలు తెరుచుకుంటాయి. దేవాలయాలను మూసేసి భక్తుల సందర్సనను ఆపేశారు. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. దీంతో శనివారం ఉదయం పది గంటల నుంచే దేవాలయాలను మూసేస్తూ వచ్చారు. ఇంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం మళ్లీ మూడేళ్ల తర్వాత వస్తుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేశారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఆలయాన్నితెరిచి శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆదివారం ఉదయం భక్తులను సందర్శన నిమిత్తం అనుమతిస్తారు.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా మూసేశారు. శనివారం ఉదయం పది గంటలకే ఆలయాన్ని మూసేశారు. రేపు 11 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. అలాగే, ఆదిలాబాద్ జిల్లా జ్ఞాన సరస్వతి ఆలయాన్ని కూడా మూసేశారు. గ్రహణ దోష పూజలు, సంప్రోక్షణ అనంతరం ఆదివారం ఉదయం ఆలయాన్ని తెరుస్తారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయాన్ని, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయాన్ని కూడా మూసేశారు. శ్రీమల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా గ్రహణం సందర్భంగా మూసేశారు. రేపు ఉదయం 9 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. మిగతా ఆలయాలు కూడా మూత పడ్డాయి.

English summary
Temples in Andhra Pradesh were closed during Lunar Eclipse on saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X