Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త జిల్లాలు ఏర్పడాలి: మంత్రి మాణిక్య వరప్రసాద్

Manikya Vara Prasad
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని మంత్రి మాణిక్య వరప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏడు నుంచి పది వరకు జిల్లాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కొన్ని జిల్లాలు చాలా పెద్దగా ఉన్నాయని, పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని వచ్చే రెండు రోజుల్లో తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి వివరిస్తానని, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కూడా కలుస్తానని ఆయన అన్నారు. తమిళనాడులో మనకన్నా ఎక్కువ జిల్లాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

జిల్లాల విభజనపై తాను అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. జిల్లాల విభజనకు పాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన అధ్యయనం చేయడం అవసరమని ఆయన అన్నారు. విప్‌ను ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లూ తామే గెలుస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+