వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వ్యాఖ్యల వెనుక సొంత అజెండా: శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల వెనుక సొంత అజెండా ఉందని మంత్రి శైలజానాథ్ మంగళవారం అన్నారు. త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు స్పీకర్ ముందు ఓ మాట బయట మరో మాట చెబుతున్నారన్నారు. వారు తమ తీరు మార్చుకోవాలని సూచించారు.

విద్యుత్ ఛార్జీల పెంపు కేవలం ప్రతిపాదన మాత్రమేనని, పేదలకు ఇబ్బందిగా ఉంటే ప్రభుత్వం బాధ్యతగా ఆలోచిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన వద్ద విద్యుత్ ఛార్జీలు తక్కువ అన్నారు. అనంతపురం జిల్లాలో సుబ్బరాయసాగర్ నీటి వివాదంపై మాట్లాడుతూ అది ఆధిపత్య పోరు కాదని దాహార్తి పోరన్నారు. అధికారులతో మాట్లాడిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కాగా ఉదయం మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వర్గం సుబ్బరాయసాగర్ నీటి కోసం తాడిపత్రి రెండో ఆయకట్టు వద్ద ఉన్న ఇసుక బస్తాలను తొలగించిన విషయం తెలిసిందే. జెసి స్వయంగా వచ్చి ఇసుక బస్తాలను తొలగింప చేశారు.

English summary
Minister Sailajanath suspected municipal election behind TRS chief KCR's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X