చంద్రబాబు యాత్ర: కెప్టెన్, హరీష్ గృహనిర్బంధం

Laxmikantha Rao
కరీంనగర్/వరంగల్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతు పోరుబాట యాత్రకు ముందే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వేడి రాజుకుంది. చంద్రబాబు మంగళవారం కరీంనగర్ జిల్లాలో రైతు పోరుబాట యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. బాబు యాత్రలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంత రావును పోలీసులు మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలోని తన సొంతింటిలో గృహ నిర్బంధం చేశారు.

సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్‌లో జరిగే బాబు యాత్రను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా అడ్డుకోవాలన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఇవి నిజమైతే లక్ష్మీకాంత రావుపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అయితే అంతకుముందే యాత్రలో ఎలాంటి విఘాతం లేకుండా ఉండేందుకు పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును, కరీంనగర్‌లో ఎమ్మెల్సీ నారదాసును గృహ నిర్బంధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+