టిఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్కు హైకోర్టులో ఎదురుదెబ్బ

దీంతో కేంద్ర హోంశాఖ ఎమ్మెల్యే రమేష్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన పౌరసత్వంపై హోంశాఖ విచారణను నిలిపివేయించాలని కోరుతూ రమేష్ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. విచారణపై స్టే ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో రమేష్ పౌరసత్వంపై హోంశాఖ విచారణ ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా 2010 ఉప ఎన్నికలకు ముందు రమేష్ టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.












Click it and Unblock the Notifications