హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంక్రాంతి తర్వాతే జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై చర్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: విప్‌ను ధిక్కరించి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మరింత జాప్యం చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలోని ఆరు శాసనసభా నియోజకవర్గాలకు, వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఖాళీ అయ్యే 17 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెసు పన్నిన వ్యూహంలో భాగంగానే చర్యలపై జాప్యం జరుగుతోందనే విమర్సలు వినిపిస్తున్నాయి. స్పీకర్ సాక్షిగానే తాము విప్‌ను ధిక్కరించామని, అందువల్ల విడిగా తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, తమపై అనర్హత వేటు వేయాలని వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు అంటున్నారు. అయినా వారిపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ జాప్యం చేస్తూ వస్తున్నారు.

విప్‌ను ధిక్కరించిన శానససభ్యుల వివరణలు తనకు అందాయని, వాటిని పరిశీలిస్తున్నానని స్పీకర్ మనోహర్ శుక్రవారం చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి రెండో సారి చేసిన రాజీనామా లేఖ కూడా తనకు అందిందని ఆయన చెప్పారు. జగన్ వర్గానికి చెందిన కాపు రామచంద్రా రెడ్డి మాత్రం మెలిక పెడుతున్నారు. తనకు విప్ అందలేదని, తనకు నోటీసు ఒరిజినల్ ప్రతి కావాలని ఆయన అడుగుతున్నారు. దీంతో కాపు రామచంద్రా రెడ్డికి స్పీకర్ మరోసారి నోటీసు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు శాసనసభా స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ జారీ అయి, ఉప ఎన్నికల ప్రక్రియ సాగుతున్న క్రమంలో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెసు జాగ్రత్త పడుతోందని అంటున్నారు.

కాగా, వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెసు పార్టీ సమాయత్తమవుతోంది. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, ఎస్పీ రెడ్డి, కొండా మురళి, ప్రభాకర రావులపై జనవరి 2వ తేదీన విప్ శివరామిరెడ్డి చక్రపాణికి ఫిర్యాదు చేయనున్నారు.

English summary
Assembly speaker Nadendla Manohar may further delay in taking against YSR Congress president YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X