వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైసూరు ప్యాలెస్‌లో అనంత పద్మనాభ లాంటి సంపద?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mysore Palace
మైసూరు: కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్‌లో కూడా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లాగా భారీ సంపద ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిరుడు భారీ సంపద బయటపడిన విషయం తెలిసిందే. మైసూరు ప్యాలెస్ సంపద గురించి ఓ ప్రైవేట్ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. రహస్య కెమెరాలతో కోవర్టు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. కోట్లాది రూపాయల విలువ చేసే సంపద అంబా విలాస్ ప్యాలెస్‌లో ఉన్నట్లు తెలిపింది. ప్యాలెస్ ఆవరణలోని రహస్యమైన గదుల్లో బంగారం, విలువైన ఆభరణాలు, రత్నాలు ఉన్నట్లు ఆ చానెల్ తెలిపింది.

భారీ కోశాగారం ఉన్నప్పటికీ ప్యాలెస్‌కు తగిన భద్రత లేదని ఆ టీవీ చానెల్ విమర్శించింది. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల అధికారులు ప్యాలెస్‌ను సందర్శించారు. మైసూరు ప్యాలెస్‌లో భారీ సంపద ఉన్నట్లు గతంలో కూడా ఊహాగానాలు చెలరేగాయి. అయితే భారత ఆర్కియోలజికల్ సర్వే సంస్థ అధికారులు దాన్ని ధ్రువీకరించలేదు. మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ శతాబ్ది ఉత్సవాలు జరగునున్నాయి. ఈ సందర్భంగా భారీగా సందర్శకులు రానున్నారు.

English summary
After the massive treasure haul in Kerala's Padmanabhaswamy temple that grabbed both the media and public attention last year, there are rumors of yet another treasure trove in the famed Mysore Palace in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X