వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తం తాగే కెసిఆర్‌ను కోర్టుకీడ్చుదాం రండి: మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narsimhulu
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కోర్టుకు ఈడ్చుదాం రండి అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం తెలంగాణ కోసం మృతి చెందిన అమరవీరుల కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు. అమరవీరులను అడ్డు పెట్టుకొని కెసిఆర్ కోట్లు దండుకున్నారని విమర్శించారు. 2001లో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి కెసిఆర్‌కు వచ్చిందని, ఇప్పుడు ఆయన వద్ద యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కడివో తెలువాల్సి ఉందన్నారు. ఆయన వద్ద ఉన్న ఆస్తులను అమరవీరులకు పంచాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టుకు వెళతామన్నారు. కెసిఆర్ పెత్తందారీ వ్యవస్థను కొనసాగనివ్వమన్నారు. అమరవీరుల కుటుంబాలని టిడిపి ఆదుకుంటుందని చెప్పారు. మృతిచెందిన అమరవీరుల కుటుంబాలలో ఒక్క కుటుంబాన్నైనా కెసిఆర్ పరామర్శించారా అని ప్రశ్నించారు.

ఉప ఎన్నికల కోసమే సంక్రాంతి తర్వాత, ఫిబ్రవరిలో ఉద్యమం, దీక్షలు చేస్తానని కెసిఆర్ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ప్రయత్నాలు అన్నీ అని విమర్శించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కెసిఆర్ ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. అమరవీరుల పేరుతో అక్రమ సంపాదనకు రుచి మరిగాడని, విద్యార్థుల రక్తం తాగి కెసిఆర్ ఫామ్ హౌస్‌లో నిషాలో ఉన్నారని విమర్శించారు. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిన కెసిఆర్‌ను జైలుకు పంపేదాకా నిద్రపోమన్నారు.

English summary
TDP senior leader Mothkupalli Narasimhulu lashes out at TRS chief K Chandrasekhar Rao for his properties. He called amaraveerula families, come with them to filed case against KCR in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X