మేం 'తెలంగాణ' నుండి తప్పించుకోలేం: ఎంపీ సర్వే

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వరంగల్ యాత్రను కొందరు అడ్డుకోవడం సరికాదని టిఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. రేపు నిజామాబాద్ వస్తున్న జగన్ను కూడా అడ్డుకోవద్దన్నారు. యాత్రల వల్ల ప్రజలకు, రైతులకు మేరు జరిగితే మంచిదే కదా అన్నారు. అడ్డుకోవడం వల్లనే బాబుకు, జగన్కు మరింత పేరు వస్తుందని, అడ్డుకోకుంటే వారికి ప్రాధాన్యతే ఉండదన్నారు. ప్రజలకు ఎవరు సేవ చేసిన స్వాగతిస్తామని, తమ పార్టీ నష్టపోతుందని తాము ఎప్పుడు భావించమన్నారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. సోనియా గాంధీ కాంగ్రెసు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రెండు రాష్ట్రాల్లోనే పార్టీ అధికారంలో ఉండేదని ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీయే ఉందన్నారు.












Click it and Unblock the Notifications