సిఎం జయలలితపై వ్యాఖ్యలు: నక్కీరన్ ఆఫీసుపై దాడి

కాగా ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలితను పార్టీలో కీలకమైన ప్రచార కార్యదర్శిగా నియమించడాన్ని పార్టీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేక అసంతృప్తి వ్యక్తం చేశారని, బ్రాహ్మణవాద వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ ద్రవిడ పార్టీలో బ్రాహ్మణ మహిళను ప్రచార కార్యదర్శి వంటి కీలక పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని, అయితే ఎంజిఆర్ వారి వద్ద తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారని ఆ పత్రిక రాసింది. జయలలిత చాందసవాదాలు కలిగిన బ్రాహ్మణ స్త్రీ కాదంటూ ఆయన వారికి చెప్పారు. ఈ విషయంపైనే కార్యకర్తలు దాడి చేశారు. అయితే పత్రిక యాజమాన్యం దానిని సమర్థించుకుంటోంది. మేం జయలలితకు వ్యతిరేకంగా రాయలేదని, చాందసవాదం లేదని చెప్పడం ద్వారా ఆమెకు అనుకూలంగానే కథనం రాసినట్టని తెలిపారు.












Click it and Unblock the Notifications