వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కేంద్రం దగ్గర పరిష్కారం లేదు: లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

lagadapati rajagopal
విజయవాడ: తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏమీ లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ ఆదివారం అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ముందు ఎటువంటి పరిష్కారం లేదన్నారు. దానిని రాష్ట్రమే తేల్చుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం తెలంగాణపై తీర్మానం పెట్టి పంపిస్తే అప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీల నిర్ణయంపై కేంద్రం నిర్ణయం ఆధారపడి ఉందన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదించిన తర్వాత కూడా తెలంగాణ అవుతుందని అప్పుడే చెప్పలేమని అది మొదటి మెట్టు మాత్రమే అన్నారు. ఆ తర్వాత కేంద్రం నిర్ణయం ఉంటుందన్నారు.

కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపితే కేంద్రం నిర్ణయిస్తుందని చెప్పారని తెలిపారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పాస్ అయిందా అని లగడపాటి ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిన తర్వాత కేంద్రాన్ని అడగాలన్నారు.

English summary
Vijayawada MP Lagadpati Rajagopal said 
 
 that there is no solution at central 
 
 government about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X