వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాను కిరణ్ బతికే ఉన్నాడు, గాలిస్తున్నాం: డిజిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
కాకినాడ: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ బతికే ఉన్నాడని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. భాను కిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. భాను కిరణ్ మరణించి ఉంటాడంటూ ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో అతను బతికే ఉన్నాడని డిజిపి చెప్పారు. ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దులో (ఎఒబి)లో మావోయిస్టుల కదలికలు తగ్గాయని, వారి ప్రభావం తగ్గిందని ఆయన చెప్పారు. మరో నెలలో మానవ రహిత విమానంతో గాలింపు చర్యలు చేస్తామని ఆయన చెప్పారు.

పోలీసు శాఖలో త్వరలో 12 వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. చమురు సంస్థలకు తగిన భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు. సహకార సంఘంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు తీసుకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో 8 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
DGP Dinesh Reddy said that Bhanu Kiran, accused in Maddelachervu Suri murdert case, is alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X